అందాల రాక్షసితో టాలీవుడ్కి పరిచయమైన భామ లావణ్య త్రిపాఠి. తర్వాత సోగ్గాడే చిన్నినాయనా,శ్రీరస్తు శుభమస్తు లాంటి వరుస హిట్లను సొంతం చేసుకున్న ఈ భామ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం వరుణ్ సరసన మిస్టర్ సినిమాలో నటిస్తున్న లావణ్య … రవితేజతో కలిసి నటించే అవకాశాన్ని కొట్టేసింది.
చాలాగ్యాప్ తర్వాత రవితేజ నటిస్తున్న చిత్రం టచ్ చేసి చూడు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో మాస్ మసాలా ఎంటర్ టైనర్గా ఈ సినిమా తెరకెక్కనుంది. నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తుండగాఒక హీరోయిన్గా రాశీఖన్నా ఎంపికైంది. అయితే, రెండో సినిమా కోసం లావణ్య త్రిపాఠిని ఎంపికచేశారు.
అయితే, లావణ్య త్రిపాఠి ఈ ఆఫర్ని తిరస్కరించిందట. రీసెంట్ గా చైతూ సినిమా ఒకటి పూజా కార్యక్రమాలను జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చేయడానికి లావణ్య త్రిపాఠి అంగీకరించింది. సురేష్ బాబు .. సాయికొర్రపాటి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా కోసమే డేట్స్ సర్దుబాటు చేయలేక పోతున్నానంటూ రవితేజ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట సోగ్గాడే బ్యూటీ లావణ్య త్రిపాఠి.