విజయవాడలో విరిగిపడ్డ కొండచరియలు

4
- Advertisement -

విజయవాడలో భారీ వర్షాలకు ఇళ్ల పై విరిగిపడ్డాయి కొండచరియలు. విజయవాడ – మొగల్ రాజపురంలో ఇళ్ల పై కొండచరియలు విరిగిపడ్డాయి. వాటిలో నివసిస్తున్న పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ ఘటనలో ఒక బాలిక మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.

దెబ్బ తిన్న ఇళ్లలో ఇంకా కొందరు ఉన్నారని స్థానికులు అంటున్నారు. సహాయక చర్యలు అక్కడ ఇంకా కొనసాగుతున్నాయి. భారీ వర్షాలతో విజయవాడ బస్టాండ్ దగ్గర బ్రిడ్జి వద్ద రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పలు బస్సులు, లారీలు, కార్లు గోతుల్లో దిగబడి ఇరుక్కుపోతున్నాయి.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వర్షం ప్రభావంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. సహాయక చర్యలకు ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి.. ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు.

Also Read:TTD: మాడ వీధులను తనిఖీ చేసిన ఈవో

- Advertisement -