TTD:క‌పిలేశ్వ‌రాల‌యంలో ల‌క్ష‌కుంకుమార్చ‌న సేవ‌

30
- Advertisement -

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రావణమాసంలో చివరి శుక్రవారం రోజున శ్రీ కామాక్షి అమ్మవారికి లక్ష కుంకుమార్చన సేవ వేడుక‌గా జ‌రిగింది. ఇందులో భాగంగా ఉద‌యం గ‌ణ‌ప‌తి పూజ‌, పుణ్యాహవ‌చ‌నంతో ప్రారంభించి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు శ్రీ కామాక్షి అమ్మవారికి ల‌క్ష‌కుంకుమార్చన నిర్వ‌హించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు శ్రీ చంద్ర‌శేఖ‌ర స్వామి, శ్రీ మ‌నోన్మ‌ణి అమ్మ‌వారు పుర‌వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో  వేంద్ర‌బాబు, ఏఈవో  సుబ్బ‌రాజు, సూప‌రింటెండెంట్   భూప‌తి, టెంపుల్ ఇన్స్పెక్ట‌ర్లు ర‌వికుమార్‌,   బాల‌కృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Also Read:గిల్‌ సెంచరీ వృథా…భారత్‌పై బంగ్లా గెలుపు

- Advertisement -