కుమారి శ్రీమతి కూడా పెళ్లి గురించే

151
- Advertisement -

మలయాళ బ్యూటీ నిత్యామీనన్‌ నటిస్తున్న వెబ్ సిరీస్ కుమారి శ్రీమతి నుంచి అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ రిలీజ్ చేసిన టీజర్‌ ఆకట్టుకుంటోంది. గోమతేష్ ఉపాధ్యాయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో గౌతమి, మురళీమోహన్, నిరుపమ్, తిరువీర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈనెల 28 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ వెబ్‌ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇక టీజర్ విషయానికి వస్తే.. వయసు అయిపోతున్న పెళ్లి పై ఆసక్తి చూపని ఓ అమ్మాయి కథను ఈ టీజర్ లో హైలైట్ చేశారు.

నిత్యామీనన్ ఎప్పటిలాగే తన పాత్రలో అద్భుతంగా నటించింది. ఆమె డబ్బింగ్ చెప్పిన విధానం కూడా బాగుంది. టీజర్ చివర్లో చెప్పిన డైలాగ్ బాగానే హైలైట్ అయ్యింది. అన్నట్టు నిత్యామీనన్ చేసిన ఈ సిరీస్ హిట్ అయితే.. ఆమె నుంచి మరిన్ని సిరీస్ లు రానున్నాయి. అందులో నైట్ ఫ్లిక్స్ కోసం నిత్యామీనన్ ఓ బోల్డ్ సిరీస్ కూడా చేయబోతుంది. యూఎస్ వెళ్లిన ఓ తెలుగు అమ్మాయి అక్కడ హనీ ట్రాప్ లో పడి.. ఎలా తన జీవితాన్ని నాశనం చేసుకుంది ?, మోడ్రన్ లైఫ్ మత్తులో ఎలా చిత్తు అయిపోయింది? అనే కోణంలో ఆ సిరీస్ సాగుతుందట.

పైగా ఈ సిరీస్ లో నిత్యామీనన్ తో పాటు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటించనుంది. అన్నట్టు.. వరలక్ష్మి శరత్ కుమార్ – నిత్యామీనన్ నటించిన వెబ్ సిరీస్ లు ఓకే రోజు రిలీజ్ కాబోతున్నాయి. నిత్యామీనన్ ‘కుమారి శ్రీమతి’ సినిమా సెప్టెంబర్ 28 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘మ్యన్షన్ 24’ వెబ్ సిరీస్ అదే రోజున హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ రెండు లేడీ ఓరియెంటెడ్ వెబ్ సీరిస్ లు ఏ రేంజ్ లో మెప్పిస్తాయో చూడాలి.

Also Read:చంద్రబాబుపై మరో కేసు.. బిగుస్తున్న ఉచ్చు?

- Advertisement -