కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకారం

205
kumaraswamy
- Advertisement -

కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ చీఫ్‌ కుమారస్వామి ప్రమాణస్వీకారం చేశారు. విధానసౌధలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ విజుభాయ్ ..కుమారస్వామితో ప్రమాణ స్వీకారం చేయించారు. కుమారస్వామితో పాటు కర్ణాటక పీసీసీ అధ్యక్షులు డాక్టర్ పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బలపరీక్ష అనంతరం మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు.

గతంలో స్పీకర్‌గా పనిచేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్‌ స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు 22,జేడీఎస్‌కు 12 మంత్రి పదవులు దక్కాయి. బలనిరూపణ తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండనుంది.

ఈ కార్యక్రమం కోసం విధానసౌధ ముందు ఓ భారీ వేదికను ఏర్పాటు చేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు, శరద్ పవార్, కేజ్రీవాల్, మాయావతి, అఖిలేష్ యాదవ్,సీపీఎం నేత సీతారం ఏచూరి,సీపీఐ నేత ప్రకాశ్ కారత్ హాజరయ్యారు.

- Advertisement -