ఎన్నికల తర్వాత కేటీఆర్..సీఎం:అలీ

353
Mahmood-Ali
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల తర్వాత కేసీఆర్ పీఎం…కేటీఆర్ సీఎం కాబోతున్నారని జోస్యం చెప్పారు హోంమంత్రి మహమూద్ అలీ. మహబూబ్ నగర్‌ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అలీ జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక భూమిక పోషిస్తారని చెప్పారు.

రాష్ట్రంలో 16 ఎంపీలు గెలిస్తే… దేశంలో 160 మంది ఎంపీల మద్దతును కేసీఆర్ కూడగడతారని చెప్పారు. దేశంలో కాంగ్రెస్‌, బీజేపీ పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా అని చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల అభ్యర్థులే ఎన్నికల్లో ఎక్కువ మంది విజయం సాధించనున్నారని చెప్పారు.

టీఆర్‌ఎస్ పక్కా సెక్యూలర్ పార్టీ అని, అందుకే అన్ని వర్గా ల ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌నే ఆదరించారని తెలిపారు. మహబూబ్‌నగర్ ఎంపీగా మన్నె శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్‌ను ప్రజలు గెలిపించుకుంటే పెండింగ్ ప్రాజెక్టులకు జాతీయ హోదాతోపాటు కొత్త రైల్వేలైన్‌ను సాధించుకోవచ్చన్నారు.

- Advertisement -