తెలంగాణలో విద్యారంగంపై కొనసాగుతున్న నేరపూరిత నిర్లక్ష్యానికి అద్దంపట్టే చిత్రం ఇది అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో పూర్వప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న అంగన్వాడీలో పందులు తిరుగాడుతుంటే, బిక్కుబిక్కుమంటూ భోజనం కోసం లైన్లో విద్యార్థులు నిలబడ్డారన్నారు.
కాంగ్రెస్ గద్దెనెక్కాక రెండేళ్లలో తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థల్లో 102 ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు జరిగి 2188 పిల్లలు అసుపత్రుల పాలయ్యారు. వివిధ కారణాల వల్ల 118 మంది ముక్కుపచ్చలారని పిల్లలు చనిపోయారు.ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నా రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు అని మండిపడ్డారు.
12 మంది పిల్లలు. 5 పందులు!
తెలంగాణలో విద్యారంగంపై కొనసాగుతున్న నేరపూరిత నిర్లక్ష్యానికి అద్దంపట్టే చిత్రం ఇది.
మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో పూర్వప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న అంగన్వాడీలో పందులు తిరుగాడుతుంటే, బిక్కుబిక్కుమంటూ భోజనం కోసం లైన్లో నిలబడిన… pic.twitter.com/PpCnN8eHxi
— KTR (@KTRBRS) December 23, 2025
Also Read;లిక్కర్ ‘స్కామ్’లో సీఎం కుమారుడు!

