ఫీవర్ ఆస్పత్రిలో పిల్లల వార్డు బంద్:కేటీఆర్

8
- Advertisement -

ముఖ్యమంత్రి మిస్ వరల్డ్ పోటీ కోసం పరుగులు తీస్తూ ఉండగా, పిల్లల ఆరోగ్యాన్ని పట్టించుకునే వారెవరూ అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్.ఫీవర్ ఆస్పత్రిలో పిల్లల వార్డు బంద్ అనే శీర్షికన పత్రికలో వచ్చిన వార్తను షేర్ చేశారు కేటీఆర్.

ఫీవర్ హాస్పిటల్‌లో పీడియాట్రిషియన్ల నియామకం కోసం తెలంగాణ ప్రభుత్వానికి ఎంత సమయం పడుతుంది? ఏడాదికిపైగా పిల్లలు, తల్లిదండ్రులు ఎందుకు బాధపడాలి? చెప్పాలన్నారు. వర్షాకాలం వస్తే సీజనల్ ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశముంది. దయచేసి ఈ విషయంలో జోక్యం చేసుకుని అత్యవసరంగా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ని కోరారు.

 

Also Read:అణు బెదిరింపులను సహించం:మోదీ

- Advertisement -