బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ సభకు భారీగా జనసమీకరణకు ప్లాన్ చేస్తున్నారు పార్టీ నేతలు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది రైతులు ఎడ్ల బండితో బీఆర్ఎస్ సభకు బయలుదేరారు.
ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కేటీఆర్. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా బండెనక బండి కట్టి తెలంగాణ ఇంటి పార్టీ పండుగకు బయలుదేరిన అన్నదాతల సంకల్పానికి నా సలాం అని పేర్కొన్నారు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నాయకత్వంలో.. సూర్యాపేట రైతులు చూపించిన ఈ చైతన్యం.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకం అని కొనియాడారు.
మండుతున్న ఎండలను సైతం
లెక్కచేయకుండా “బండెనక బండి కట్టి”
తెలంగాణ ఇంటి పార్టీ పండుగకు బయలుదేరిన
అన్నదాతల సంకల్పానికి నా సలాం..జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో..
సూర్యాపేట రైతులు చూపించిన ఈ చైతన్యం
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకంస్వీయ రాజకీయ అస్థిత్వమే
తెలంగాణకు… https://t.co/jZyLyzAaO1— KTR (@KTRBRS) April 23, 2025
Also Read:ఆటా ఆధ్వర్యంలో ధరిత్రి దినోత్సవం

