శ‌ర్వానంద్ శ్రీకారం.. ముఖ్య అతిథిగా కేటీఆర్..

315
ktr for Srikaram
- Advertisement -

హీరో శ‌ర్వానంద్‌ ప్ర‌స్తుతం శ్రీకారం చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం మార్చి 11న విడుద‌ల కానుంది. ఈ సినిమాలో శ‌ర్వానంద్ స‌ర‌స‌న ప్రియాంక అరూల్ మోహన్ హీరోయిన్‌గా న‌టించింది. కిషోర్ రెడ్డి దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో తెరకెక్కిన శ్రీకారం సినిమాలో రైతులకు సంబంధించిన విషయాలను వ్యవసాయం యొక్క గొప్పతనంను చూపించబోతున్నారు. సినిమా ప్ర‌మోష‌న్ బాధ్య‌త‌ల‌ను రామ్ చ‌ర‌ణ్ తీసుకున్న‌ట్టు తెలుస్తుంది.

ఈ సినిమాకు సంబంధించి జోరుగా ప్ర‌మోష‌‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అయితే మార్చి 8న ఖ‌మ్మంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు మేక‌ర్స్. ఈ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నారు. అలాగే 9వ తేదీన హైదరాబాద్ లో కేటీఆర్ ముఖ్య అతిథిగా శ్రీకారం రిలీజ్ వేడుక జరుగబోతున్నట్లుగా శర్వానంద్ పేర్కొన్నారు.

- Advertisement -