పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం..

321
minister ktr
- Advertisement -

ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న వరంగల్- నల్గొండ- ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం పని చేస్తున్న పార్టీ ఎన్నికల ఇంచార్జీలు, నాయకులు మరియు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్.టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విస్తృతంగా మూడు జిల్లాల్లో పర్యటిస్తూ విద్యావంతులను కలుస్తూ బరిలో ముందు వరుసలో ఉన్నారు. మూడు జిల్లాలకు సంబంధించిన పార్టీ శ్రేణులంతా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం గట్టిగా పని చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

ఒక్క నల్గొండ జిల్లాకే 3 వైద్య కళాశాలలు వచ్చాయి. వరంగల్ నగరానికి పెట్టుబడులతో పాటు ఐటీ పరిశ్రమ పెట్టుబడులు వస్తున్నాయి. ఖమ్మం నగరంలో ఐటీ టవర్ ప్రారంభించుకున్నాం. ఈ మూడు జిల్లాల్లో యువకుల నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం టాస్క్ ఏర్పాటు చేశామని, మరోవైపు హైదరాబాద్, రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎస్. వాణిదేవి అభ్యర్థిత్వానికి ప్రత్యర్థుల నుంచి సైతం సానుకూల స్పందన వస్తుందన్నారు. టీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరం గత ఏడు సంవత్సరాలలో అద్భుతమైన ప్రగతిని సాధించింది. హైదరాబాద్ నగరానికి వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమల ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు.హైదరాబాద్‌లో జరిగిన నగర అభివృద్ధిని నగర విద్యావంతుల దృష్టికి తీసుకుపోవాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రతి ఒక్క ఓటర్ ని నేరుగా కలిసి టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలన్నారు.

ఉద్యోగాల కల్పన విషయంలో బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి. మన ప్రభుత్వం వచ్చినాక 1,33,000 ఉద్యోగాలు ఇచ్చాం.. మరో 50 వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయబోతున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మన ప్రభుత్వానికి పార్టీకి ఉన్న సంబంధం పేగు బంధం లాంటిదని, ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు అనేక మినహాయింపులు ఇచ్చి ప్రమోషన్లు ఇచ్చామని తెలిపారు. పార్టీ ఇంచార్జ్ లు రానున్న వారం రోజుల పాటు అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో విద్యావంతుల నుంచి వస్తున్న స్పందనను పలువురితో మాట్లాడి ఈ సందర్భంగా కేటీఆర్ తెలుసుకున్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో కేటీఆర్‌తో పాటు హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు.

- Advertisement -