ఇబ్రహీం పట్నం చెరువును అభివృద్ధి చేయాలి :కేటీఆర్‌

102
- Advertisement -

కుతుబ్‌షాహీల కాలంలో నిర్మించిన ఇబ్రహీంపట్నం చెరువును అభివృద్ధి చేసేందుకు గల అవకాశాలపై దృష్టి సారించాలని హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ) అధికారులకు మంత్రి కేటీఆర్‌ సూచించారు.

ఇబ్రహీం పట్నం చెరువును అభివృద్ధి చేసేందుకు గల అవకాశాలను పరిశీలించాలని ఓ నెటిజన్ కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. రిసార్ట్‌తో పాటు బోటింగ్ కాయకింగ్ పారాసైలింగ్ వంటి ఏర్పాట్లను అందుబాటులోకి తీసుకువస్తే పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందుతుందని ఆ నెటిజన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. వారాంతాల్లో మంచి టూరిస్ట్ ప్లేస్‌గా ఈ ప్రాంతం గుర్తింపు పొందే అవకాశం ఉందన్నారు.

ఈ ట్వీట్‌పై కేటీఆర్ స్పందిస్తూ చెరువు అభివృద్ధి గల అవకాశాలను అన్వేషించాలని హెచ్‌ఎండీఏ అధికారులకు సూచించారు.

- Advertisement -