KCR:కేసీఆర్ ఫైటర్‌..బీజేపీ చీటర్

36
- Advertisement -

ప్రధానమంత్రి అసత్యాల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే. తారక రామారావు. ప్రధానమంత్రి జూమ్లాలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి… ప్రధానమంత్రి అబద్ధాల ప్రచారకర్త అని మండిపడ్డారు. ఇంటింటికి నీళ్ళు ఇస్తాం, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాం, 15 లక్షల రూపాయలు ఇస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, భారత ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్లకు చేర్చుతానని ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనన్నారు. ప్రధానమంత్రి స్థాయిని తగ్గించేలా నరేంద్ర మోడీ మాట్లాడాడని..రాజకీయాల కోసం ఇంత నీచనికి దిగజారిన వ్యక్తి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు అన్నారు.

ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మధ్య జరిగిన ఒక అధికారిక సమావేశాలను నీచమైన రాజకీయాలకు ప్రధానమంత్రి వాడుతున్నారని…ప్రధానమంత్రి అబద్ధాల తర్వాత ప్రతి అధికారిక సమావేశానికి ఒక కెమెరాని పట్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. తనకు అలవాటైన అబద్దాలకు అనుగుణంగా మోడీ రాజకీయాలు చేస్తున్నారని…విద్య అర్హతల విషయంలోనే అబద్దం చెప్పిన ప్రధానమంత్రి మాటలను ఎవరు నమ్ముతారన్నారు. ప్రధానమంత్రి లాంటి వ్యక్తి ఇన్ని అబద్ధాలు ఆడడం దురదృష్టకరం అన్నారు. ఇంతకంటే బాధాకరం శోచనీయం ఇంకోటి లేదన్నారు.

ఏ రాష్ట్రం వెళ్తే ఆ రాష్ట్రం వెళ్లి అబద్దాలు ఆడడం ప్రధానమంత్రి కి అలవాటు అయిందని…బెంగాల్ వెళ్తే మమతా బెనర్జీ పైన, ఒరిస్సా వెళ్తే నవీన్ పట్నాయక్ పైన, మేఘాలయ వెళ్తే సంగ్మా పైన అబద్దాలు చెప్పారన్నారు. ఆ తర్వాత వారితోనే పొత్తులు పెట్టుకుంటారు…ఈ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ కి కర్ణాటక నుంచి డబ్బులు ఇచ్చిందని చెప్తున్నారన్నారు. ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి లేదని…ప్రధానమంత్రి తో ఉంటే మంచివాళ్లు… ప్రకాశ్ బాదల్- సుబ్బి సింగ్ బాదల్ వంటి వాళ్ళతో పొత్తులు పెట్టుకోలేదా.. కాశ్మీర్లలో ముఫ్తీ మహమ్మద్ సహిద్ కుమార్తే తో పొత్తు పెట్టుకోవచ్చు. చంద్రబాబు నాయుడు లోకేష్ గారితో కలిసి పని చేయవచ్చు nda లో ఉండవచ్చు. బాల్ ఠాక్రే కొడుకు ఉద్ధవ థాక్రే తో కలిసి బిజెపి పొత్తు పెట్టుకోవచ్చు అన్నారు. అప్పుడు రాజులు యువరాజులు గుర్తుకురారు…జనతాదళ్ సెక్యూలర్ దేవేగౌడ, వారి కుమారుడు కుమారస్వామితో పొత్తు పెట్టుకోవచ్చు అన్నారు.

మీతో ఉంటే వారసత్వ రాజకీయాలు గుర్తుకు రావు లేదంటే గుర్తుకు వస్తాయన్నారు. ప్రధానమంత్రి పచ్చి అబద్దాలకోర…బిజెపి jhoota ఫ్యాక్టరీ ఆఫ్ ఇండియా, jhoota పార్టీ ఆఫ్ ఇండియా అన్నారు. బిజెపి ఒక వాట్సాప్ యూనివర్సిటీ…ప్రధానమంత్రి కథలు చెప్పడంలో ఆరితేరినారు, ఆయన సినిమా కథలు రాయడంలో ప్రయత్నించాలన్నారు. పార్టీలని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న ఎన్డీయే లో చేరాల్సిన అవసరం ఎవరికీ లేదు… ఎన్ డి ఏ ఒక మునిగిపోతున్న నావా అన్నారు. ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు అన్నారు. రాహుల్ గాంధీ వచ్చి brs బిజెపికి బీ టీం అంటాడు… కాంగ్రెస్ పార్టీ తో కలిసి పని చేస్తున్నమని ప్రధానమంత్రి అంటాడన్నారు.

కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్కి డబ్బులు వస్తుంటే కేంద్ర ఐటి శాఖ కానీ ఇతర శాఖలు కానీ నిద్రపోతున్నాయా..పిచ్చికుక్క కరిచిన వారైతెనే ఎన్డీఏలో చేరుతారన్నారు. ఒకవైపు పార్టీలన్నీ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు మేము NDA తో ఎందుకు వెళ్తాం అన్నారు. మీకు ఈ డి, సి బి ఐ వంటివి తప్ప ఇంకెవరు మీతో ఉన్నారు…కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఉన్న హేమంత్ బిశ్వశర్మ పైన ఉన్న కేసు మీ పార్టీలో చేరినాక ఏమైందన్నారు. నారాయణ రనే, జ్యోతి రదిత్యా సిందియ వంటి వాళ్ళ పైన ఉన్న కేసులు మీ పార్టీలో చేరినాక ఏమైనయన్నారు. కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడుతున్న ప్రధానమంత్రి, మంత్రులు జ్యోతిరాదిత్య సిండియ ఎవరు, జైశా ఎవరో, అనురాగ్ ఠాకూర్ ఎవరో చెప్పాలన్నారు. కెసిఆర్ ఒక ఫైటర్, ఆయన నరేంద్ర మోడీ లాంటి చీటర్ తో కలిసి పని చేయరు…మేము ఢిల్లీ బానిసలం గుజరాత్ బానిసలం కాదు అన్నారు.

Also Read:Vinod Kumar:కేసీఆర్ అంటేనే మోడీకి భయం

- Advertisement -