KTR:సీఎం, డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాల్సిందే

4
- Advertisement -

నిండు శాసనసభలో సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మహిళల పట్ల అత్యంత అవమానకరంగా ప్రవర్తించారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్..రేవంత్ వ్యాఖ్యలు ఖచ్చితంగా అమోదించ తగ్గవి కావని తెలిపారు.

ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంతో హుందాగా, ప్రజలకు సేవ చేసే గుణం వారిది. ..అలాంటి మహిళ నేతలను ఇంత చులకనగా మాట్లాడటం సిగ్గు చేటని విమర్శించారు.

Also Read:ఎస్టీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం సంచలన తీర్పు

- Advertisement -