KTR:కాంగ్రెస్ నేతలు…రాబంధులు

28
- Advertisement -

కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడిన కేటీఆర్…రైతు బంధు ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ రాబంధులకు ఎప్పుడైనా వచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెసోళ్లేమో మూడు గంట‌లు క‌రెంట్ అంటారు…బీజేపోళ్లు హిందు, ముస్లిం అంటరు త‌ప్ప వారికి ఇంకో మాట రాదు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మూడు గంట‌ల క‌రెంట్ ఇస్తానంటున్న కాంగ్రెసా.. మూడు పంట‌లు ఇస్తానంటున్నా కేసీఆరా.. మ‌తం పేరిట మంట‌లు పెడుతానంటున్న బీజేపీనా.. ఎవ‌రు కావాలో ఆలోచించాలని సూచించారు.

న‌రేంద్ర మోదీ ప్ర‌జ‌ల‌కు చేసిందేమీ లేదని…సిలిండ‌ర్ ధ‌ర మాత్రం 1200 అయింది. నాడు గ్యాస్ బండ‌కు మొక్కి కాంగ్రెస్‌కు పిండం పెట్ట‌మ‌ని చెప్పిండో.. మ‌ళ్లీ మ‌నం అదేప‌ని బీజేపీకి చేయాలన్నారు. ఓటు ద్వారా బీజేపీకి బుద్ది చెప్పి…డిపాజిట్ గ‌ల్లంతు చేయాలన్నారు. మ‌న రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేది కేసీఆర్ మాత్ర‌మేనని….. ఢిల్లీ బానిస‌ల‌తో ఏం కాదు అని ప్రశ్నించారు.

Also Read:47 ఏళ్ల వయసులో మళ్లీ డిమాండ్

తెలంగాణ రాక‌ముందు క‌రెంట్ పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవాలన్నారు. ఎరువులు పంచే తెలివిలేదు. విత్త‌నాలు ఇచ్చే ముఖం లేదు. ఆఖ‌రికి పోలీసు స్టేష‌న్ల‌లో విత్త‌నాలు పంచిన దౌర్భాగ్య‌పు పాల‌న కాంగ్రెస్‌ది అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ధ‌ర‌ణి, రైతు బంధు, ద‌ళిత బంధు, బీసీ బంధు ర‌ద్దు చేస్తార‌ని ఆలోచించాలన్నారు.

50 ఏండ్లు అధికార‌మిచ్చినా కాంగ్రెస్ ఏం చేయ‌లేదు. ఇప్పుడు అధికారం ఇస్తే ఏం చేస్తారు..? 50 ఏండ్ల‌లో చేసింది ఏమీ లేదు.. కానీ గ‌డ‌ప గ‌డ‌ప‌కు కాంగ్రెస్ అంట‌. కాంగ్రెస్ మాట‌లు వింటుంటే విచిత్రం అనిసిస్తుంది అని ధ్వ‌జ‌మెత్తారు.

- Advertisement -