KTR:హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసే కుట్ర

6
- Advertisement -

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్ర జరుగుతోందని సంచలన కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.హైదరాబాద్ ని జూన్ తర్వాత కేంద్రపాలిత ప్రాంతం చేయాలని బీజేపీ, కాంగ్రెస్ చూస్తున్నాయన్నారు. మేము అధికారంలో ఉంటే ఈ 4 నెలల్లో కరీంనగర్ అంతర్జాతీయ స్థాయి నగరాలతో పోటీ పడేదన్నారు. కరీంనగర్‌లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్..ఈ ఎన్నికల్లో 12 ఎంపీ సీట్లు వస్తే ఏడాదిలోపే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు. తుంటి విరిగినా, కూతురు జైలు పాలైనా, నమ్మిన వారు మోసం చేసి పార్టీ మారినా కేసీఆర్ బెదరలేదన్నారు.

గోదావరి నీళ్లను తరలించే కుట్రలు చేస్తున్నారని… కాంగ్రెస్, బీజేపీల కుట్రలను అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ ను గెలిపించడమే ఏకైక మార్గం అన్నారు.కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని శాసించే స్థితి వస్తుంది. కాంగ్రెస్ కేసులు పెట్టాలని ఒత్తిడి తెచ్చినా, బండి సంజయ్ లొల్లి చేసినా ఏమీ కాదు అన్నారు.

మాకు బీజేపీతో ఫిక్సింగ్ ఉంటే కవితను జైల్లో వేస్తారా..? ఇష్టం లేని చోటకు జీవన్ రెడ్డిని పంపి కరీంనగర్ లో డమ్మీ, మల్కాజిగిరిలో డమ్మీ, చేవెళ్లలో డమ్మీ అభ్యర్థులను నిలిపి.. ఇలా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది కాంగ్రెస్. రాహుల్ గాంధీ లిక్కర్ స్కామ్ ఫేక్ అంటే.. రేవంత్ రెడ్డి ఏమో లిక్కర్ స్కామ్ జరిగిందని అంటారు. టీవీ చర్చల్లో బీజేపీకి ఓటేయాలని రేవంత్ అన్నారు.

Also Read:KCR:కేంద్రంలో వచ్చేది హంగే

- Advertisement -