తెలంగాణ పప్పు రేవంత్…భారత్ పప్పు రాహుల్

51
- Advertisement -

కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మానకొండూరు బీజేపీ నాయకులు బీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…దావూద్ ఇబ్రహీం కంటే రేవంత్ రెడ్డి డేంజర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ స్క్రిప్ట్ రైటర్‌ని మార్చుకోవాలని సూచించారు. ఎక్స్‌పాక్షన్ జాయింట్‌ను చూపిస్తూ కాళేశ్వరం బ్రిడ్జి కూలిపోతుందని ఫోటోలు పెడుతున్నారని, ఇది వీళ్ల అవగాహన అని మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై అవాకులు చవాకులు పేలితే ఊరుకునే ప్రసక్తేలేదని…మేడిగడ్డ బ్రిడ్జి కూలిపోతుందని ప్రచారం చేస్తున్నారని చురకలు అంటించారు. కాంగ్రెస్ కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రధాన మంత్రులు అవినీతి ఆరోపణలతో జైల్లో ఊచలు లెక్కబెట్టారన్నారు. పార్టీ పేపర్ నేషనల్ హెరాల్డ్‌లో కూడా అవినీతికి పాల్పడి సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొన్నారని అలాంటి వారు అవినీతి గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లే అవుతుందన్నారు.

రాష్ట్రానికి కాళేశ్వరం వరమైతే కాంగ్రెస్ దేశానికి శనిశ్వరం అన్నారు. రాహుల్ గాంధీకి చరిత్ర తెలవదని, తెలుసుకునే సోయి కూడా లేదన్నారు. ఆదర్శ్, బోఫోర్స్, కామన్‌వెల్త్, బొగ్గు ఇలా చెప్పుకుంటూ పోతే సహజ వనరులన్నీ దోచుకున్న దొంగలు అని తీవ్ర ఆరోపణలు చేశారు.

Also Read:నా రియ‌ల్ లైఫ్‌కి భిన్నంగా విధి:రోహిత్ నందా

- Advertisement -