హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని స్వప్నించి, 25 సంవత్సరాల పాటు తెలుగు రాజకీయాలను శాసించి, చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కారణజన్ముడు కేసీఆర్ అన్నారు.
కేసీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా 60 లక్షల మంది గులాబీ దండు సైనికులు పని చేయాలి. ఇదే ఆ మహానుభావుడికి ఇచ్చే బర్త్ డే గిఫ్ట్ అన్నారు. ఈ సందర్బంగా కేసీఆర్ గారిపై రూపొందించిన డాక్యూమెంటరీని పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కలిసి వీక్షించారు.
ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో శాసనమండలిలో ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు మహమూద్ అలీ, వి.శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు తదితర నాయకులు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు.
Also Read:తెలంగాణ భవన్లో కేసీఆర్ బర్త్ డే వేడుకలు