టీఎస్ఐఐసీపై కేటీఆర్ రివ్యూ..

234
ktr
- Advertisement -

రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల్లో టీఎస్ఐఐసీ చేపడుతున్న ప్రాజెక్టులపైన పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోపాటు, నగరం చుట్టుపక్కల ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక పార్కులపైన ఈ సమావేశంలో మంత్రి వాటి పురోగతిని తెలుసుకున్నారు. దండు మల్కాపూర్లో ఏర్పాటు చేయనున్న యంయస్ యంఈ పార్కు దాదాపుగా ప్రారంభానికి సిద్దంగా ఉన్నట్లు అధికారులు మంత్రి తెలిపారు. బండమైలారంలోని సీడ్ పార్కు, బండ తిమ్మాపూర్లో పుడ్ ప్రాసెసింగ్ పార్కు, ఏల్ ఈడీ పార్కు (శివనగర్) లో పనులు వేగంగా నడుస్తున్నాయని, ఇప్పటికే పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్దత వ్యక్తం చేశాయన్నారు.

సిరిసిల్లాలో ఏర్పాటు చేయనున్న అప్పారెల్ పార్కు పనుల పురొగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక పార్కుల పనులు వేగవంతం చేయాన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్కుల వివరాలు, వాటిలోకి వచ్చిన, రానున్న పెట్టుబడులు మెత్తం, ఉద్యోగ అవకాశాల వివరాలతో ఒక సమగ్రమైన నివేదిక తయారు చేయాలని మంత్రి టీఎస్‌ఐఐసీ అధికారులను కోరారు. నగరంలో టీఎస్ఐఐసీ చేపడుతున్న దుర్గం చెరువు సుందరీకరణ పూర్తి కావస్తున్నట్లు, టివర్క్ పనులు త్వరలో శంకుస్థాపనకు రెడీగా ఉన్నాయని తెలిపారు.

ktr

దీంతో పాటు పాత పారిశ్రామిక ఏస్టేట్లలోని కంపెనీలు, వాటి ప్రస్తుత పరిస్ధితులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉప్పల్ ఏస్టేట్లో కార్యకలాపాలు నిలిపేసిన కంపెనీలతో టియస్ఐఐసి సమావేశం కావాలని మంత్రి అదేశించారు. జివో 20 ప్రకారం కాలుష్యకారక పరిశ్రమలను నగరం అవలకు తరలించాలన్న కార్యక్రమంలో బాగంగా సనత్ నగర్, నాచారం, కాటేదాన్ మొదలయిన ప్రాంతాల్లోని పరిశ్రమలతో సమావేశం కావాలని అధికారులను మంత్రి అదేశించారు.

ఇలాంటి పారిశ్రామిక వాడల్లో ఉపాధికల్పించేలా ఐటి లాంటి నూతన రంగాల పరిశ్రమలను అభివృద్ది చేసేందుకు అయా కంపెనీల యాజమాన్యాలతో ప్రాథమికంగా సమావేశం అవ్వాలన్నారు. ఒక వేల పారిశ్రామిక వాడల్లోని వారంత ముందుకు వస్తే ఇలా నూతనంగా, కాలుష్యం లేని ప్రాంతాలకు మళ్లించేందుకున్న అవకాశాలను పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, టియస్ ఐఐసిఎండీ నర్సింహా రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -