మున్సిపాలిటీలుగా ఔటర్‌ గ్రామాలు..

256
KTR Review on ORR Villages
- Advertisement -

ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న గ్రామాలను పురపాలికలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. ఇవాళ సచివాలయంలో పురపాలక, పంచాయితీరాజ్ శాఖ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. రాజేంద్రనగర్, ఇబ్రహీపట్నం, కుత్బుల్లాపూర్, మహేశ్వరం, సంగారెడ్డి నియోజక వర్గాల ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు,ఎంపీలు రంగా రెడ్డి, సంగారెడ్డి, మేడ్చేల్ జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

15వేలకు మించి జనాబా ఉన్న పంచాయితీలను ఖచ్చితంగా నగర పంచాయితీలు, మున్సిపాలీటీలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని యంఏల్యేలకు తెలిపిన మంత్రి, వాటి ఎర్పాటు చేయడం కోసం పరిసర ప్రాంతాలను కలపడంపైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. నూతన పురపాలికల ఎర్పాటు వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలన్నారు. పురపాలికలును ఎర్పాటు చేసిన తర్వతా కనీసం రెండు సంవత్సరాల పాటు పన్నుల పెంపు ఉండబోదన్నారు. దీంతోపాటు నూతన పురపాలక సంస్ధలకు నిధులను సైతం అందిస్తామన్నారు. నూతనంగా పురపాలక సంస్ధలు ఎర్పాటు చేయడం ద్వారా అయా ప్రాంతాల అభివృద్ది వేగవంతం అవుతుందన్నారు. ప్రభుత్వం నగరంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చేపడుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ద్వారా రాబోయే జనాభాను సైతం ఈ ప్రక్రియలో పరిణనలోకి తీసుకోవాలన్నారు.

KTR Review on ORR Villages

ప్రస్తుతం అవుటర్ రింగ్ రోడ్డు లోపల 167 గ్రామాలున్నాయని, వాటి భౌగోళిక పరిస్దితులను బట్టి నూతన పురపాలక సంస్ధలుగా ఏర్పాటు చేయడం, ఇతర పురపాలికల్లో వీలీనం చేయడం చేస్తామని మంత్రి తెలిపారు. అధికారుల నివేదికలతో పాటు స్ధానికంగా ఉన్న పరిస్ధితులకు అనుగుణంగా ప్రజా ప్రతినిధులు కలిసి నూతన పురపాలికలకు ప్రతిపాదనలివ్వాలన్నారు. ఈ మేరకు స్ధానిక ఎమ్మెల్యేలతో కలిసి పని చేయాలని కలెక్టర్లను మంత్రి అదేశించారు. అమీన్ పూర్, బొల్లారం, కొంపల్లి, పుప్పాలగూడా, ప్రగతి నగర్, తెల్లాపూర్, కొల్లూర్, తుర్కంయాజాల్ లతో పాటు మరికొన్ని మున్సిపాలీటీలను ఏర్పాటు చేయడం పై ఈ సమావేశంలో చర్చించారు.

- Advertisement -