సంక్రాంతి నాటికి ఎల్‌ఈడీ వెలుగులు

306
- Advertisement -

రాష్ట్రంలోని పట్టణాల్లో ఏల్ ఈ డీ లైట్ల ఏర్పాటుపైన మంత్రి కేటీ రామారావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ రంగ సంస్ధ ఈ యస్ యస్ యల్ సంస్ధ యండి సౌరబ్ కుమార్ పాల్గోన్నారు. గత కొంత కాలంగా వివిధ పట్టణాల్లో చేపట్టిన ఏల్ ఈ డీ లైట్ల పంపణీ తీరుమీద మంత్రి ఈ సమావేశంలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత మూడు నెలల్లో సూమారు నాలుగున్నర లక్షల లైట్లను పంపీణీ చేసినట్టు ఈ ఈ యస్ యల్ యండి తెలిపారు. అయితే ఈ ప్రక్రియను మరింత వేగంగా ముందుకు తీసుకుపోవాలన్నారు మంత్రి కెటియార్ . రాష్ర్టంలోని మున్సిపాలీటీల్లో మెత్తం వీధి దీపాలను ఏల్ ఈ డీ లైట్లతో మార్చేందుకు చర్యలు తీసుకోవాలని సిడియంఏ దాన కిషోర్ ను అదేశించారు. ఈఈయస్ యల్ ప్రభుత్వ రంగ సంస్ధతో ఈ మేరకు ఒక ఒప్పందాన్ని చేసుకోవాలన్నారు. ముఖ్యంగా రాష్ర్టంలోని కార్పోరేషన్లలో పూర్తి స్ధాయి విధీదీపాల ఏర్పాటును వేంటనే పరిశీలించాలని మంత్రి కేటీఆర్‌ అధికారులను కోరారు.

unnamed (7)

జీహెచ్‌ఎంసీ పరిధిలోని మెత్తం 4.5 లక్షల వీధి దీపాలకు ఏల్ ఈ డీ లైట్లు బిగించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జీహెచ్‌ఎంసీ కమీషనర్ ను అదేశించారు. ఈ సమావేశంలోనే నగరంలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు అమలు, ఫలితాల మీద కంపెనీ మంత్రికి వివరాలను అందజేసింది. నగరంలో ఏర్పాటు చేయబోయే ఈ లైటింగ్ వ్యవస్థలో అత్యాధునిక సౌకర్యాలుండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కంపెనీ యండిని కోరారు. వీటితోపాటు పోలీస్ డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటు చేస్తున్న కెమెరాలు, వైవై సౌకర్యం వంటి అంశాల ఏర్పాటు పరిగణలోకి తీసుకుని ఈ ఏల్ఈడీ లైట్ల ఏర్పాటు చేయాలన్నారు. ఈ లైటింగ్ ఏర్పాటు సాద్యమైనంత వరకు స్ట్మార్ట్ గా ఉండాలన్నారు. ( అర్ధరాత్రి కొన్ని లైట్లు అటోమేటిగ్గా అరిపోవడం, డిమ్ కావాడం లాంటి) ఈ ఓప్పందం ప్రకారం ప్రస్తుత కరెంటు బిల్లుల్లో కనీసం 50 శాతం తగ్గేలా నిబంధన ఉండాలన్నారు.

ఈ మొత్తం ప్రక్రియను వచ్చే సంక్రాంతి నాటికి పూర్తి చేయలన్నారు. ఈ మేరకు కంపెనీ పూర్తి స్దాయి వర్క్ ఫోర్సుతో పనులు మెదలు పెట్టాలని మంత్రి కోరారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఈఈయస్ యల్ యండి సౌరబ్ కూమార్ , వచ్చే సంక్రాతి నాటికి నగరంలోని మెత్తం విధీ దీపాలకు ఏల్ ఈ డీ లైట్లు బిగించే అంశాలన్ని సవాలుగా తీసుకుని పూర్తి చేస్తామన్నారు. ఈ సమావేశంలో మెట్రో వాటర్ వర్క్ పంపునీటీ సెట్లకు అవుతున్న విద్యుత్ భారాన్ని తగ్గించుకునేందుకు అధునాతన ఏనర్జీ ఏపిసియంట్ పంపుసెట్లను వాడే అంశాన్ని పరిశీలించి ఒక నివేధిక ఇస్తామని మంత్రికి కంపెనీ యండి తెలిపారు.

ఈ సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మెహన్, పురపాలక శాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరీ యంజి గోపాల్, జియచ్ యంసి కమీషనర్ జనార్ధన్ రెడ్డి , సిడియంఏ దానకిశోర్, ఈఈ యస్ యల్ బృంద సభ్యులు ఉన్నారు.

- Advertisement -