గడువులోగా ప్రాజెక్టులు పూర్తి చేయాలి:కేటీఆర్

227
KTR review on IT&Industries
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వ పాలసీలకు దేశ వ్యాప్తంగా ప్రసంశలు అభించాయని, ఈ మేరకు రాష్ర్టానికి వచ్చిన పరిశ్రమలు, పెట్టుబడులే ప్రాతిపాదికగా పనిచేయాలని అధికారులను అదేశించారు మంత్రి కేటీఆర్. పరిశ్రమలు,ఐటీ శాఖ అధికారులతో  మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో సమీక్ష నిర్వహించిన కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వం గత మూడు సంవత్సరాల్లో అనేక అద్బుతమైన విధానాలను అమలులోకి తీసుకుని వచ్చిందన్నారు. అయితే ఇక ఈ రెండు సంవత్సరాల పాటు పాలసీల్లో హమీ ఇచ్చిన అంశాల అమలును మరింత వేగంవంతం చేయాలన్నారు.

ఇకపైన వచ్చే ప్రతి మూడు నెలల్లో సాధించే శాఖపరమైన మైలురాళ్లను ముందే తెలియజేయాలన్నారు. ఈ మైళురాళ్లను అందుకోలేని అధికారులపై  కఠినంగా వ్యవహారించేందుకు వెనకడబోమని మంత్రి హెచ్చరించారు. గత ఎడాది ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ తో దేశంలో ప్రథమ స్థానంలో నిలిచామని, ఈ సారి అదే స్ధానాన్ని కోనసాగించేలా పనిచేయాలని అధికారులను కోరారు.

KTR review on IT&Industries
ఈ సమావేశంలో ఒక్కో కార్యక్రమం, ప్రాజెక్టులపైన మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ ఫార్మసిటీ, మెడికల్ డైవైజెస్ పార్కులపైన మంత్రి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పలు పరిశ్రమల నుంచి వచ్చిన ఆసక్తి వ్యక్తికరణ మేరకు సూమారు 8500 వేల ఎకరాల ప్రాథమిక డిమాండ్ ఉన్నదని అధికారులు తెలిపారు. త్వరలోనే ఎన్విరాన్ మెంటల్ అనుమతుల మీద పబ్లిక్ హియరింగ్ ఉన్న నేపథ్యంలో స్థానిక ప్రజలకు ఫార్మసీటీ ద్వారా కలిగే లాభాలు, ఉద్యోగాలు, పార్కు లో జీరో లిక్వీడ్ డిచార్జ్  ఉన్నందున ఎలాంటి కాలుష్యం ఉండదని వివరించాలన్నారు.

ఎయిరో స్పేస్ రంగంలో మరిన్ని పెట్టుబడులు తీసుకుని వచ్చేలా ప్రయత్నాలు చేయాలన్నారు.  ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక కంపెనీలు నగరంలో ఉన్నాయని, వీటికి మరిన్ని అంతర్జాతీయ కంపెనీలను నగరానికి తీసుకుని రావాలన్నారు. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు, మిషన్ భగీరథ ప్రాజెక్టుతో కలిసి సమన్వయం చేసుకుంటున్నామని అధికారులు మంత్రికి తెలిపారు. మిషన్ భగీరథ ప్రాజెక్టుతో పాటే తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కూడా పూర్తవుతుందన్నారు.

టాస్క్ ద్వారా ఇప్పటిదాకా ప్రదానంగా ఇంజనీరింగ్ విద్యార్దులకు శిక్షణ ఇస్తున్నామని, త్వరలో ఈ శిక్షణ కార్యక్రమాలను హెల్త్ సెక్టార్, ఫార్మ, అటోమోటివ్స్ రంగాలకు శిక్షణ కార్యక్రమాలను విస్తృతపరుస్తున్నట్లు తెలిపారు. టాస్క్ కేంద్రాలను జిల్లాలకు విస్తరించేందుకు దశల వారీగా ప్రయత్నాలు ప్రారంభించాలని మంత్రి అదేశాల కోరారు.  ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, పరిశ్రమల కమీషనర్ నదీమ్ అహ్మద్, టియస్ ఐఐసి యండి వెంకటనర్సింహ రెడ్డి, పరిశ్రమలు, ఐటి శాఖల అధికారులు పాల్గోన్నారు.

- Advertisement -