నేతన్నలకు నేరుగా రాయితీలు…

242
KTR Review on Chenetha
- Advertisement -

రాష్ర్టంలోని చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం తలపెట్టిన ప్రయోజనాలు నేరుగా వారికే చేందేలా చర్యలు తీసుకుంటున్నామని చేనేత,టెక్స్ టైల్స్ శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. ఈ రోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో టెక్స్ టైల్, చేనేత శాఖాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. తమ ప్రభుత్వం సమైఖ్య రాష్ర్ట చరిత్రలోనూ ఏన్నడు లేనంతగా ఈ బడ్జెట్ లో చేనేత రంగానికి కేటాయింపులు చేశామని మంత్రి తెలిపారు. ఈ  ప్రయోజనాలన్నీ చేనేత కార్మికులకే నేరుగా చేరేలా ఉండాలన్నారు. ఇందులో ఎలాంటి లీకేజీలు లేకుండా చూడాలని,  అధార్, బయోమెట్రిక్ అధారంగా ఈ సబ్సీడీ అందజేసే ప్రయత్నాలు చేయాలని అధికారులను మంత్రి అదేశించారు. చేనేత కార్మికులకే నేరుగా వారీ బ్యాంకు ఖాతాల్లోకి సబ్సీడీలు చేరేలా పాలసీలు తయారు చేయాలన్నారు.

గత సమావేశంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి అదేశాల మేరకు చేనేతల స్థితిగతుల మీద  క్షుణ్ణంగా చేనేత డైరెక్టరీని తయారు చేయాలని మంత్రి అధికారులను అదేశించారు. ఈ నివేధికలో రాష్ర్టంలో ఉన్న చేనేత మగ్గాలు, చేనేత కార్మికుల సంఖ్య, ఉత్పాదాక సామర్ధ్యం ఏంత అనే అంశాలతో కూడిన పూర్తి గణంకాలు, అంచనాలతో కూడిన సమగ్రమైన సమాచారం ఉండాలన్నారు. ముఖ్యమంత్రి అలోచనల మేరకు చేనేతలకు, పవర్ లూమ్, టెక్స్ టైల్స్ రంగాల పట్ల ప్రత్యేకమైన విధానాలుండాలని మంత్రి అధికారులను అదేశించారు.

ప్రస్తుతం రాష్ర్టంలో నిర్వహిస్తున్న చేనేత మగ్గాల సర్వేలో 17000 చేనేత మగ్గాలున్నాయని. ఇప్పటికే 14300 చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న చేనేత కార్మికులను కాపాడుకోవడమే తెలంగాణ ప్రభుత్వ చేనేత విధాన ప్రాథమిక లక్ష్యంగా ఉంటుందన్నారు. చేనేత రంగంలో లాభదాయకత లేకుంటే ఇతర రంగాలకు తరలి వెళ్లేందుకు కూడా తాము సహకారం అందిస్తామన్నారు. ఇతర రంగాల్లోకి వెళ్లే కార్మికులకు ప్రత్యేకమైన సబ్సీడీలతో కూడిన రుణ సౌకర్యాన్ని కల్పించే అలోచన చేస్తున్నామన్నారు.

KTR Review on Chenetha
ఇక చేనేత మగ్గాల మీద ఏ ఏ రకాల వస్ర్తాలను తయారు చేస్తున్నారో తెలుసుకోవాలన్నారు. ముఖ్యంగా పట్టు చీరలు, కాటన్, గ్రే క్లాత్ వంటి రకాలను  ఎంత మంది నేస్తున్నారనే వివరాలుంటే వారికోసం తీసుకునే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని మంత్రి కెటి రామారావు తెలిపారు. ఈ మేరకు ప్రతి ఒక్క రకం క్లాత్ కు పూర్తి స్ధాయి  వివరాలతో నివేదిక కావాలన్నారు. చేనేతలకు సబ్సీడిలు ఇస్తూనే వారి నుంచి ఉత్పత్తులను కోనుగోలు చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి అదేశించారు. తమ ఉత్పులను ప్రభుత్వానికే కాకుండా బయట మార్కెట్ లో అమ్ముకునే అవకాశాన్ని సైతం కల్పిస్తామన్నారు.

ప్రభుత్వమే మాస్టర్ వీవర్ పాత్రను పోషించాలని మంత్రి అన్నారు. దీని ద్వారా చిన్న చేనేత కార్మికులకు మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు యార్న్ పైన 50 శాతం సబ్సీడి ఇస్తున్నామని మంత్రి తెలిపారు. కాటన్, పాలియస్టర్, లెనిన్, సిల్క్, వూల్ వివిధ రకాల యార్న్ ప్రొక్యూర్ మెంట్ ఏలా జరుగుతుందో, ఈ ప్రొక్యూర్ మెంట్ లో తీసుకురావాల్సిన మార్పులను చర్చించారు. నేషనల్ హ్యాండూలూమ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ యార్న్ డిపోల వివరాలు ఉన్నాయి… సొంత డిపోలు ఏర్పాటు చేసేలా కోరారు.  యార్న్ నేరుగా ఏర్పాటు చేస్తే ఉండే  ప్రయోజనాల మీద చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రితో పాటు పరిశ్రమ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టెక్స్ టైల్ డైరెక్టర్ శైలజరామయ్యర్ తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -