పొంగులేటికి కౌంటర్‌ ఇచ్చిన కేటీఆర్

3
- Advertisement -

దీపావళికి ముందే తెలంగాణలో బాంబులు కి వెళ్తాయని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర కామెంట్లు చేశారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ సుతిల్ బాంబులు పేలుతాయా, లక్ష్మీ బాంబులు పేలుతాయా, తుస్సు బాంబులు పేలుతాయో చూడాలన్నారు.

మంత్రి పొంగులేటి తనపై జరిగిన ఈడి రైట్స్ లో దొరికిన నోట్ల కట్టలపై చెప్తారో వేచి చూద్దాం అన్నారు. అమృత్ పథకంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిదికి 1137 కోట్ల టెండర్ కట్టబెట్టారని తాను ఆరోపించిన అంశంపై విచారణకు ఆదేశిస్తారో చూద్దామన్నారు. లేదా బిజెపి ఆగ్ర నాయకులను ఎలా ప్రసన్నం చేసుకున్నారో ప్రజలకు చెప్తారని అనుకుంటున్నానన్నారు.

Also Read:పేదింటి ఆడబిడ్డకు అండగా మర్రి..

- Advertisement -