సాయిచంద్ వ‌ర్ధంతి..కేటీఆర్ ఘన నివాళి

9
- Advertisement -

మాజీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ‌వేద సాయిచంద్‌కు ఘన నివాళి అర్పించారు మాజీ మంత్రి,బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సాయిచంద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సాయిచంద్‌కు కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాళుల‌ర్పించారు.

తెలంగాణ మలివిడత ఉద్యమంలో ఆటాపాటా తీసుకొచ్చిన చైతన్యం అంతాఇంతా కాదు. పాట లేకుండా తెలంగాణ ఉద్యమమే లేదు అని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు కొనియాడారు. విద్యార్థి ఉద్యమమైనా, సామాజిక చైతన్య వేదిక అయినా, మలి దశ ఉద్యమమైనా.. వేదిక ఏదైనా సరే పాటే సాయిచంద్‌ ఆయుధం అన్నారు.

తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తనదైన శైలిలో పాట ద్వారా ప్రజలకు సాయిచంద్‌ చాటిచెప్పారన్నారు.

Also Read:మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ కన్నుమూత..

- Advertisement -