నీ ధైర్యానికి సెల్యూట్‌:కేటీఆర్‌

285
ktr
- Advertisement -

భారత్‌-పాక్ మధ్య యుద్ధమేఘాలు అలుకున్న సంగతి తెలిసిందే. ఓ వైపు శాంతి అంటూనే మరోవైపు కవ్వింపు చర్యలకు పాల్పడింది పాక్‌ ఆర్మి. భారత్‌ చేపట్టిన వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు పాక్‌ బుధవారం విఫలయత్నం చేసింది. అప్రమత్తంగా ఉన్న భారత బలగాలు పాక్‌ దుస్సాహసాన్ని తిప్పికొట్టాయి.

ఇక పీవోకేలో కూలిపోయిన భారత్ మిగ్‌ 21 బైసన్‌ విమాన పైలట్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ ధైర్యాన్ని చూసి దేశం గర్వపడుతోంది. పాక్ సైన్యం హింసిస్తున్న ఎలాంటి సమాచారం భయటపెట్టకుండా అభినందన్‌ ప్రదర్శించిన అభినందన్ అందరి మనసులు గెలుచుకున్నారు.

రాజకీయాల కోసం, టీఆర్పీ రేటింగ్‌ల కోసం సన్నివేశాలను ఇంత దారుణంగా చిత్రీకరిస్తారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పాకిస్తాన్‌ సైన్యం చిత్రహింసలు పెడుతున్నా దేశ రహస్యాల గురించి అడుగుతున్నా నోరు మెదపని పైలట్ గుండె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఇంతటి ఔన్నత్యమైన వ్యక్తిత్వానికి సెల్యూట్ చేస్తున్నానంటూ దేశ భక్తిని చాటుకున్నారు.

- Advertisement -