సున్నం రాజయ్య మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం…

186
sunnam rajaiah
- Advertisement -

మాజీ ఎమ్మెల్యే,సీపీఎం నేత సున్నం రాజయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు మంత్రి కే తారకరామారావు.ఆదివాసీలు,గిరిజనుల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా జీవితమంతా వారి శ్రేయస్సు కోసం పని చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.

రాజయ్య మృతి తెలంగాణ సమాజానికి తీరనిలోటు అని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి కేటియార్ , రాజయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధించారు.

- Advertisement -