KTR:అమెరికా పోలీసుల తీరు బాధాకరం

34
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం క‌ర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి అమెరికాలోని సియోటెల్‌లో జ‌రిగిన రోడ్డుప్ర‌మాదంలో చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. జాహ్న‌వి ప్రాణాల‌కు విలువ లేదంటూ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్య‌ల‌ను తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. పోలీసు అధికారి నిర్ద్వంద వ్యాఖ్య‌లు తనను తీవ్రంగా కలిచివేశాయని.. భార‌త్‌లోని అమెరికా రాయ‌బారి యూఎస్ ప్ర‌భుత్వ అధికారుల‌ను సంప్ర‌దించి, జాహ్న‌వి కుటుంబానికి న్యాయం చేయాల‌ని అభ్య‌ర్థిస్తున్న‌ట్లు తెలిపారు.

ఎన్నోఆశ‌యాల‌తో ఉన్న ఆమె రోడ్డుప్ర‌మాదంలో చ‌నిపోవ‌డం విషాద‌క‌రం. ఆమె జీవితానికి ప‌రిమిత‌మైన విలువ ఆపాదించడం సరికాదన్నారు.అదే విధంగా ఈ అంశంపై స్వ‌తంత్ర దర్యాప్తు జ‌రిపేలా డిమాండ్ చేయాల‌ని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్ట‌ర్ జైశంక‌ర్‌ను కోరారు.

- Advertisement -