KTR:సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగలేఖ

27
- Advertisement -

నేతన్నలపై కాంగ్రెస్ కక్ష కట్టిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన కేటీఆర్..నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నా…ఆదుకోరా అని ప్రశ్నించారు.కార్మికులు రోడ్డున పడ్డా కనికరించరా అని ప్రశ్నించారు.

చేనేత మిత్రా వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేనేతలకు అందుతున్న అన్ని పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేయాలని, అవసరం అయితే మరింత సాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. పదేళ్ల తరువాత సమైక్యరాష్ట్రం నాటి సంక్షోభం.. ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో వారు ఎదుర్కొంటున్నారు.

నేతన్నల బతుకులు ఆగం అయ్యేలా కాంగ్రెస్ విధానాలు ఉన్నాయి. నేతన్నలకు అర్డర్లు అపేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఏం చేయాలని అనుకుంటుందో చెప్పాలంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. గతంలో మాదిరే నేతన్నలకు చేతినిండా అర్డర్లు వేంటనే ఇవ్వాలి, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడంతోపాటు ఎన్నికల కోడ్ వల్ల ఆపిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. రైతన్న మాదిరే, నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధకరమని, వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

Also Read:చికెన్ ఫ్రై.. ఇలా ట్రై చేయండి!

- Advertisement -