- Advertisement -
తొలి గండం దాటితే తొంభై ఏండ్ల ఆయుష్షు అని పెద్దల మాట అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అల్లుని కంపెనీల కోసం,అదానీ పరిశ్రమల కోసం అన్నదమ్ముల ఆస్తుల పెంపు కోసం ఢిల్లీకి మూటల చేరవేత కోసం అన్నారు.
పేదల భూములు లాక్కునేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలను ఎదుర్కొని లాఠీల దెబ్బలు తిని, చేతులకు బేడీలు వేసుకొని,నెలలపాటు చెరసాలల పాలైనా భూములను చెరబట్టడంలో మాత్రం రేవంత్ ప్రభుత్వం పట్టువదలడం లేదు అన్నారు.
పట్నంలో పేదల గూళ్లు, ఉపాధి కేంద్రాలు పాలడబ్బాలు, చెప్పుల దుకాణాలు…పల్లెల్లో పేదల భూములు,పల్లెల్లో గరీబోళ్ల ఇండ్లు పంటపొలాలు, పచ్చని పైర్లలో రేవంత్ అధికారుల స్వైర విహారం…కాదేది అణచివేతకు అనర్హం కాదన్నట్టు తెలంగాణలో సాగుతున్న కాంగ్రెస్ పాలన అన్నారు.
Also Read:కేజ్రీవాల్ వల్లే ఓటమి: అన్నా హజారే
- Advertisement -