తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పిన కేసీఆర్

1
- Advertisement -

తెలంగాణ ప్రజల ఖ్యాతిని, ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు మాజీ మంత్రి కేటీఆర్. ఐనవోలు మండల కేంద్రంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జన సమీకరణ కోసం మండల ఇన్‌చార్జీలు గుజ్జ గోపాల్ రావు, ఇండ్ల నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.

సమావేశం మధ్యంలో కేటీఆర్‌కు ఫోన్ చేయగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వతంత్రం వచ్చిన 78 ఏళ్ల చరిత్రలో మన తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలుగా పుట్టి 25 ఏళ్ల పాటు కొనసాగుతున్నవి రెండు పార్టీలేనని తెలిపారు. అందులో ఒకటి తెలుగుదేశం. రెండోది బీఆర్‌ఎస్‌ అన్నారు.

Also Read:చంద్రబాబు చేతుల్లోని సాగర్ ప్రాజెక్టు!

బీఆర్‌ఎస్‌ 24 ఏళ్లు పూర్తి చేసుకోని 25 ఏటా అడుతుపెడుతున్న సందర్భంగా వరంగల్‌లో జరుగబోయే 25 ఏళ్ల రజతోత్సవ సభను గతంలో జరిగిన సభల కన్న గొప్పగా చేపట్టాలన్నారు. రాష్ట్రం మొత్తానికి ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా నిర్వహించాలన్నారు.

- Advertisement -