బీజేపీకి ఎందుకు ఓటేయాలో చెప్పండి: కేటీఆర్

141
ktr minister
- Advertisement -

బీజేపీ నేతలకు ఎందుకు ఓటేయాలో ఒక్క కారణం చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్…గ్యాడ్యుయేట్స్‌ కోసం బీజేపీ,కేంద్రం చేసిందేంటో చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ రాంచందర్‌ గ్రాడ్యుయేట్స్‌ కోసం ఏం చేశారో చెప్పాలన్నారు. మత ప్రాతిపదికన రాజకీయాలు కాదు జనహితం కోసం రాజకీయాలు చేయాలన్నారు. ఏడాదికి కోటి ఉద్యోగాలు అని చెప్పిన బీజేపీ ఏడు సంవత్సరాల్లో ఏడు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలన్నారు.

జీడీపీ అంటే గ్యాస్,డీజీల్,పెట్రోల్ అనేలా పరిస్ధితి మారిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రతి వ్యక్తి అకౌంట్లో రూ. 15 లక్షలు వేస్తామని తెలిపిన బీజేపీ ఇంతవరకు ఒక్క పైసా ఎవరికి వేయలేదన్నారు. ఝూటా మాటలతో ప్రజలను ఇంకెంత కాలం మభ్యపెడతారని ప్రశ్నించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, వాణిదేవి గెలవడం ఖాయమన్నారు.

బీజేపీకి ఎందుకు ఓటేయాలో చెప్పాలని ఎమ్మెల్సీ రాంచందర్‌ని సూటిగా ప్రశ్నించిన కేటీఆర్…వాణీదేవికి ప్రతి ఒక్క గ్యాడ్యుయేట్ మద్దతు పలకాలన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో లక్షా 32 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.

- Advertisement -