పద్మారావుకు మద్దతివ్వండి:భట్టితో కేటీఆర్‌

331
clp
- Advertisement -

తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌గా మాజీ మంత్రి పద్మారావు పేరును సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,ఉత్తమ్ కుమార్‌లతో భేటీ అయ్యారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఎమ్మెల్యే కేటీఆర్‌. సీఎల్పీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో మంత్రి వేములతో పాటు పద్మారావు ఉండగా కేటీఆర్‌ ప్రతిపాదనకు కాంగ్రెస్ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది.

ktr uttam

ఈ సందర్భంగా కేటీఆర్‌-ఉత్తమ్‌ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తన ఫోన్‌నెంబర్‌ను ఎందుకు బ్లాక్‌ చేశారని ఉత్తమ్‌.. కేటీఆర్‌ను అడిగారు. దీనికి కేటీఆర్‌ బదులిస్తూ.. మీ నెంబర్‌ నేను బ్లాక్‌ చెయ్యగలనా?.. నేను కేవలం మెసేజ్‌లు మాత్రమే చూస్తాను అని అన్నారు.ఇక ఇప్పటికే ఎంఐఎ, బీజేపీ ఏకగ్రీవంగా డిప్యూటీ స్పీకర్‌ని ఎనుకునేందుకు ఆమోదం తెలిపాయి.

(సత్తుపల్లిని జిల్లా చేయండి ఎమ్మెల్యే సండ్ర  వెంకటవీరయ్య ) https://goo.gl/fbZNoy

- Advertisement -