టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీలతో కేటీఆర్‌ సమావేశం..

127
ktr
- Advertisement -

పార్టీ జనరల్ సెక్రటరీలతో మంత్రి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఈరోజు సమావేశం అయ్యారు. ఈ భేటీకి పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు హాజరు. పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మార్గనిర్దేశనం మేరకు చేపట్టిన పార్టీ సంస్థాగత కార్యక్రమాల పురోగతిని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సమీక్షించారు. జనరల్ సెక్రటరీలు ఇన్చార్జిలుగా ఉన్న నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి కేటీఆర్.

గత రెండు వారాలుగా జరుగుతున్న కమిటీల నిర్మాణంపైన సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే దాదాపుగా 80 శాతం పైగా పూర్తయిన గ్రామ కమిటిల నిర్మాణ వివరాలు జనరల్ సెక్రటరీలు అందజేశారు. గత రెండు రోజులుగా మిగిలిన 20 శాతం కమిటీలకు సంబంధించి కూడా నిర్మాణ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఈనెల15వ తేదీ నాటికి అన్ని గ్రామ కమిటీల నిర్మాణం పూర్తి చేసి ఆ వివరాలను కేంద్ర పార్టీ కార్యాలయానికి అందించాలని జనరల్ సెక్రటరీ లకు కేటీఆర్ సూచించారు.

ఈనెల 20వ తేదీ నాటికి అన్ని మండల కమిటీలు నిర్మాణం పూర్తి కావాలి ఆదేశించారు. మండల కమిటీల నిర్మాణము /కూర్పుకు సంబంధించి పలు సలహాలు సూచనలను కేటీఆర్ ఇచ్చారు. మండల కమిటీల నిర్మాణం పూర్తయిన వెంటనే జిల్లా అధ్యక్షుల ఎంపికను గౌరవ ముఖ్యమంత్రి ప్రకటిస్తారు. జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తయిన తర్వాత జిల్లా కమిటీల ఏర్పాటు పైన జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని జిల్లా కమిటీల నిర్మాణం పూర్తిచేస్తామన్నారు కేటీఆర్.

పార్టీ సంస్థాగత కార్యక్రమాల పురోగతితో పాటు పార్టీ శ్రేణుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను కేటీఆర్ తెలుసుకున్నారు.పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు సీనియర్ పార్టీ నాయకులు సైతం ఈ సంస్థాగత నిర్మాణం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని జనరల్ సెక్రటరీలు తెలిపారు. సంస్థాగత కార్యక్రమాలతో పార్టీ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహం నెలకొందని.. ఇప్పటికే పార్టీ నిర్ణయించిన 51 శాతం కనీస పరిమితిని మించి బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు కమిటీలో చోటు దక్కిందని సెక్రటరీలు తెలిపారు.

పార్టీ కమిటీల నిర్మాణం పూర్తయిన తర్వాత సంపూర్ణ గణాంకాలు అందజేయాలని కేటీఆర్ సూచించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న మహిళా కార్యకర్తలకు పార్టీ కమిటీల కూర్పులో ప్రాధాన్యత ఇవ్వాలని ఈ విషయంలో ప్రధాన కార్యదర్శులు ప్రత్యేక చొరవ చూపించాలని కేటీఆర్ అన్నారు. పార్టీ కమిటీల నిర్మాణానికి సంబంధించి వారం రోజుల్లో మరోసారి  సమీక్షిస్తామన్నారు మంత్రి కేటీఆర్.

- Advertisement -