టీఎస్ బీ పాస్ వెబ్ సైట్ ప్రారంభం..

169
ktr
- Advertisement -

దేశ చరిత్రలోనే తొలిసారిగా, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో నేటి నుండి అందుబాటులోకి వచ్చింది టీఎస్ బీ-పాస్. ఇక నుండి ఇంటి నిర్మాణ అనుమతులు పారదర్శకంగా, ఆన్లైన్ విధానంలో లభ్యం కానుండగా మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు.

మ‌ర్రి చెన్నారెడ్డి మానవవనరుల సంస్థలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. పట్టణప్రాంతాల్లో భవన నిర్మాణం, లేఅవుట్లకు సులభతరంగా, వేగంగా అనుమతులివ్వడం కోసం ఈ వెబ్‌సైట్‌ను ప్రభుత్వం రూపొందించింది. దరఖాస్తుదారు స్వీయధ్రువీకరణతో భవన నిర్మాణానికి అనుమతి ఇస్తారు. ఈ వెబ్‌సైట్‌ తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉటుంది.

నిర్దేశించిన గడువులోగా అనుమతులు, ధ్రువపత్రాలను జారీచేయనున్నారు. 75 గజాల స్థలంలో నిర్మించుకునే భవనాలకు ఎలాంటి అనుమతులు అవసరం ఉండదు. 600 గజాల లోపు ఇండ్లకు, 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తుండే గృహాలకు స్వీయధ్రువీకరణ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అనుమతిస్తారు.

- Advertisement -