అంబులెన్స్‌లను ప్రభుత్వానికి అందజేసిన మంత్రి కేటీఆర్..

224
ktrktr
- Advertisement -

తన పుట్టినరోజు సందర్భంగా ఆరు అంబులెన్స్‌లను స్వంత ఖర్చులతో ప్రభుత్వానికి అందజేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కేటీఆర్ స్పందించిన వెంటనే ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు తమవంతుగా అంబులెన్స్‌లను అందించేందుకు ముందుకువచ్చారు. మొత్తంగా 100 అంబులెన్స్‌లు ప్రభుత్వానికి అందించనుండగా తాను ప్రకటించిన విధంగా 6 అంబులెన్స్‌లను ప్రభుత్వానికి అందజేశారు మంత్రి కేటీఆర్.

ప్రగతి భవన్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజయ్య, బాల్క సుమన్ లతోపాటు కేటీఆర్ సతీమణి శైలిమ, కూతురు అలేఖ్య పాల్గొన్నారు.

- Advertisement -