వినయ విధేయ రామ…అతిథిగా కేటీఆర్

316
vvr
- Advertisement -

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్-మాస్ట్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శీను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం వినయ విధేయ రామ. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుండగా ఇప్పటికే సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్.

ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరగనుంది. ఈ నెల 27న యూస‌ఫ్‌గూడ‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిపేందుకు స‌న్నాహాలు చేస్తుంది. ఈ కార్య‌క్ర‌మానికి టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజ‌రు కానున్నారు.

స్నేహా, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, అనన్య, ఆర్యన్‌ రాజేష్‌ కీలక పాత్ర పోషిస్తుండగా దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. చెర్రీ సరసన కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా ఇషా గుప్తా స్పెష‌ల్ సాంగ్‌తో అల‌రించనుంది.

గ‌తంలోను చ‌ర‌ణ్ మూవీ వేడుక‌కి కేటీఆర్ హాజ‌రై చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందించారు. తాజాగా మరోసారి రామ్‌చరణ్‌ మూవీ ఈవెంట్‌కి కేటీఆర్‌ హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -