కిషన్ రెడ్డి తల్లి అంత్యక్రియలకు కేటీఆర్..

308
bjp kishan reddy
- Advertisement -

బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి తల్లి అనారోగ్యం కారణంతో ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కిషన్ రెడ్డి తల్లి మృతి పట్ల వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఇక ఇవాళ మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

ఈ అంత్యక్రియలకు బీజేపీ నేతలతో పాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ,పలు పార్టీల నేతలు హాజరుకానున్నారు. బీజేపీ జాతీయఅధ్యక్షుడు అమిత్ షా, సీనియర్ నాయకులు ఎల్ కే అద్వాణీ, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనా రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తదితరలు ఫోన్ లో సంతాపం తెలిపారు.

కిషన్‌రెడ్డి తల్లి మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుతున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

- Advertisement -