TS Assembly:కేటీఆర్ – ఈటల భేటీ

39
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో మంత్రి కేటీఆర్ సరదాగా ముచ్చటించారు. ముఖ్యంగా ఈటల రాజేందర్‌తో కేటీఆర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు పది నిమిషాల పాటు వీరిద్దరూ ముచ్చటించారు. ఇప్పుడు ఇది పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇక అలాగే జగ్గారెడ్డి – కేటీఆర్ మధ్య సరదా సంభాషణ జరిగింది. టీ ష‌ర్ట్‌లో ఉన్న జ‌గ్గారెడ్డిని చూసి పిల్ల‌ల‌తో క‌లిసి తిరిగితే ఎట్ల‌న్న‌..? అని టీఎన్‌జీవో రాష్ట్ర అధ్య‌క్షుడు మామిల్ల రాజేంద‌ర్ తో అన్నారు. మీ ఇద్ద‌రికి ఎక్క‌డ దోస్తాన్ కుదిరిందని అడిగారు. దీంతో మాది ఒకే కంచం, ఒకే మంచ‌మ‌ని మామిల్ల రాజేంద‌ర్ జవాబిచ్చారు. అయితే జ‌గ్గారెడ్డిని గెలిపిస్తావా..? అని కేటీఆర్ ప్ర‌శ్నించ‌గా, సంగారెడ్డిలో జ‌గ్గారెడ్డిని గెలిపిస్తా.. మ‌న ద‌గ్గ‌ర‌కు ప‌ట్టుకొస్తా అని చెప్పారు రాజేందర్.

Also Read:కాంగ్రెస్ ‘స్క్రినింగ్ కమిటీ’ స్ట్రాటజీ?

- Advertisement -