రాహుల్‌ వ్యాఖ్యలపై కౌంటరిచ్చిన కేటీఆర్

185
KTR counter attacks to Rahul
- Advertisement -

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కుటుంబ పాలన గురించి కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం మాట్లాడడం మిలీనియం జోక్‌ గా అభివర్ణించారు మంత్రి కేటీఆర్. సంగారెడ్డి ‘ప్రజాగర్జన’ సభలో కేసీఆర్‌ సర్కారుపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించడంతో.. గురువారం రాత్రి కేటీఆర్‌ దీటుగా బదులిచ్చారు.

ktr

నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీల చిత్రాలను తన ట్వీట్లతో జత చేసి.. కాంగ్రెస్‌ పార్టీ వారా కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నదని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీని స్కాంగ్రెస్‌ పార్టీ అంటూ.. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందా? దానిని మేం నమ్మాలా? దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీది కాదా? అవినీతి గురించి స్కాంగ్రెస్‌ లీడర్లు మాట్లాడటం పెద్ద జోక్‌ అన్నారు.

KTR attacks Rahul

- Advertisement -