పెళ్లికి రండి..కేటీఆర్‌కు అఖిలప్రియ ఆహ్వానం

229
ktr
- Advertisement -

ఏపీ పర్యాటక శాఖ మంత్రి, దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతుల కుమార్తె భూమా అఖిలప్రియ పెళ్లిపీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. మంత్రి నారాయణ అల్లుడు సోదరుడు భార్గవ్ ను ఆమె పెళ్లాడబోతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ని కలిసింది అఖిల ప్రియ. తనకు కాబోయే భర్త భార్గవ్‌తో కలిసి వచ్చి, తమ వివాహానికి హాజరుకావాలని మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కాబోయే దంపతులను కేటీఆర్ అభినందించిన కేటీఆర్… వారికి జ్ఞాపికను బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూమా దంపతులు ఎమ్మెల్యేలుగా పనిచేసిన విషయాన్ని గుర్తుచేశారు.

మే 12 వీరి నిశ్చితార్ధం ఘనంగా జరుగగా ఆగస్టు 29న వివాహం జరగనుంది. తన తల్లిదండ్రులు శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డిలను కోల్పోయిన అఖిలప్రియ అనూహ్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత మంత్రి పదవిని చేపట్టారు.

- Advertisement -