యూఏఈలో శిక్ష అనుభవిస్తున్న ప్రవాస భారతీయులలు యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్ష అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ ఎన్నారై శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన అమ్నెస్టీ గడువు ఈ నెల 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
గల్ఫ్ దేశాల్లో అక్రమంగా నివాసముంటున్న వారు యూఏఈ నిబంధనలకు అనుగుణంగా రెగ్యులరైజ్ చేయించుకోవాలని మంత్రి కేటీఆర్ గల్ప్ బాధితులకు సూచించారు. దీంతో ఎలాంటి పత్రాలు లేకుండా కూడా యూఏఈలో ఉంటున్న వారు స్వదేశానికి తిరిగిరావడానికి ఇది మంచి అవకాశమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రవాస భారతీయులు యూఏఈలోని భారత రాయబార కార్యాలయంలో సమన్వయం చేసుకోవాలని తెలంగాణ ఎన్నారై శాఖ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
ఎన్నారై శాఖ ఇప్పటికే రాయబార కార్యాలయంల నుంచి రాష్ట్రానికి చెందిన వారి సమాచారాన్ని సేకరిస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. క్షమాభిక్ష కాలంలో ఎవరికైనా ప్రభుత్వం నుంచి సహాయం అవసరమైతే 9440854433 హెల్ప్లైన్ నం బర్కు ఫోన్ చేయాలన్నారు. ఈ మెయిల్ ద్వారా సాయం కావాలంటే so_nri@ telangana. gov.inకి లేదా యూఏఈ కాన్సులేటులోని హెల్ప్డెస్క్ నంబర్ +71565463903 లేదా indiandubai.amnesty@gmail.com ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.