పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాకు కేటీఆర్…

194
ktr
- Advertisement -

రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు మ‌న ఊరు – మ‌న బ‌డి పథకానికి ఎన్ఆర్ఐల నుంచి పెద్ద ఎత్తున విరాళాల‌ను సాధించడమే లక్ష్యంగా కేటీఆర్ పర్యటన సాగనుంది.

ఈనెల 26 వ‌ర‌కు మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తారు. పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారు. తెలంగాణలో పెట్టుబ‌డులు పెట్టాలని వారిని ఆహ్వానించ‌నున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రవాసాంధ్రులతో ప్రత్యేక స‌మావేశాల‌లో పాల్గొంటారు.

మన ఊరు- మ‌న బ‌డి పథ‌కానికి కోటి రూపాయలు ఆపైన విరాళం ఇచ్చే దాత‌ల పేరును ఆ పాఠ‌శాల‌కు పెడతారు. 20 ల‌క్షలు విరాళం ఇచ్చే దాత పేరును తరగతి గదికి పెట్టనున్నారు. ఇప్పటికే తెలంగాణ పెట్టుబడులకు హబ్‌గా మారింది. అమెజాన్, ఫేస్‌బుక్‌, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ సంస్థలు హైద‌రాబాద్‌ను త‌మ వ్యాపార విస్తరణకు కేంద్రంగా మార్చుకున్నాయి.

- Advertisement -