KTR:జై తెలంగాణ అంటే థర్డ్ డిగ్రీ చేస్తారా?

11
- Advertisement -

పరకాల ఘటనలో గాయపడ్డ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జై తెలంగాణ అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా అని ప్రశ్నించారు. జిల్లా ఎస్పీ అంబర్షాతో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్… కొంతమంది స్థానిక పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని..బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసు స్టేషన్లకు పిలిపించి వేధిస్తే ఊరుకోబోమని స్పష్టంచేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని… పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు.

బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్షగట్టిన పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు. ఢిల్లీ వరకు వెళతామని, న్యాయస్థానాలతోపాటు మానవహక్కుల సంఘాలను ఆశ్రయించి వారిపై చర్యలు తీసుకునే వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు.

Also Read:అవకాడో తింటే ఉపయోగాలే.. కానీ?

- Advertisement -