పట్టణాల్లోని చెరువులను అభివృద్ధి చేస్తాం..

186
KT Rama Rao, Harish Rao review on urban lakes
- Advertisement -

నగర ప్రాంతాల్లోని చెరువులను కబ్జాలకు గురికాకుండా కాపాడేందుకు, వాటిని సుందరీకరించేందుకు సమగ్రమైన ప్రణాళికలతో ముందుకు రావాలని సాగునీటి, పురపాలక శాఖల విభాగాల అధిపతులకు మంత్రులు కేటీఆర్,హరీష్ రావు అదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రాంతాల్లోని చెరువుల అభివృద్ది, పరిరక్షణ పైన పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు, సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావులు జలసౌధలో అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

తెలంగాణలోని ప్రతి మున్సిపాలీటీ, జిల్లా కేంద్రాల్లో ఒక్కో చెరువును మెదటి దశలో అభివృద్ది చేస్తామన్నారు.  పురపాలికల్లోని చెరువుల అభివృద్ది చేసేందుకు పురపాలక  శాఖ అధికారులు, రెవెన్యూ, సాగునీటి శాఖాధికారులు కలిసి పనిచేయాలన్నారు. చెరువుల యప్టియల్  (FTL)  నిర్ధారించి, సాద్యమైనంత త్వరగా చెరువులకు ఫెన్సింగ్ వేయాలన్నారు. మరోవైపు చెరువుల భూములపైన ఉన్న కేసుల పరిష్కారానికి మరింత చురుగ్గా ప్రయత్నాలు చేయాలన్నారు.

KT Rama Rao, Harish Rao review on urban lakes

హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న చెరువులపైన ఈ సమావేశంలో ప్రత్యేక చర్చ జరిగింది. నగరంలోని చెరువుల పరిరక్షణ, అభివృద్ది కోసం హెచ్ యండిఏ, జియచ్ యంసి, మెట్రో వాటర్ వర్క్ బోర్డు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పర్యాటక శాఖల అధికారులు ఒక బృందం ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా చెరువులల్లోకి వచ్చే మురికి నీటి అడ్డుకట్ట వేసేందుకు మెట్రో వాటర్ వర్క్స్ యస్ టిపిల నిర్మాణానికి ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని, పారిశ్రామిక వ్యర్ధాలను అడ్డుకట్ట వేసేందుకు పిసిబి పనిచేయాలన్నారు.

మెదటి దశలో నగరంలోని  సూమారు  చెరువుల అభివృద్ది కోసం సూమారుగా వంద కోట్లకు పైగా అంచనాలతో తయారు చేసిన ప్రణాళికలను అధికారులు మంత్రులకు వివరించారు. ఈ ప్రణాళికల్లో తయారీలో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లోని చెరువుల పరిరక్షణ కోసం చేపట్టిన అత్యుత్తమ విధానాలను అధ్యాయనం చేసినట్టు తెలిపారు. నగరంలోని చెరువులు కబ్జా కాకుండా సూమారు 30 చెరువులకు పెన్సింగ్ వేసామని, స్థానికుల సహయ సహకారాలతో వాటి రక్షణకు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. త్వరలోనే జియచ్ యంసి పరిధిలో చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపడతామని మంత్రి కెటి రామారావు తెలిపారు.

KT Rama Rao, Harish Rao review on urban lakes

చెరువుల్లో వెలిసిన అక్రమ కట్టడాల కేసులను జియచ్ యంసిలో ఏర్పాటు చేయనున్న ట్రైబ్యూనల్ పరిధిలోకి తీసుకుని వచ్చేందుకున్న అవకాశాలను పరిశీలించాలన్నారు. హైకోర్టు తీర్పు, మార్గదర్శకాలకు అనుగుణంగానే తాము చెరువుల పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నామని, యఫ్ టియల్ నిర్మాణాల విషయంలో స్టేలు తీసుకుని రావడం వలన ఈ ప్రక్రియకు విఘాతం కలుగుతున్న తీరుని హైకోర్టుకు తెలిపేందుకు ఛీఫ్ జస్టిస్ ను కలవాలని ప్రిన్సిపల్ సెక్రటరీలకు అదేశాలు జారీ చేశారు.

నగరంలోని ప్రతి చెరువుకు ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేయడం వలన వాటి అభివృద్ది కార్యక్రమాలను వేగంగా చేయవచ్చన్నారు. ఈ మేరకు అధికారులే స్వయంగా ముందుకు రావాలని మంత్రులు కోరారు.  పురపాలికలు, పట్టణాల్లోని చెరువుల అభివృద్ది కోసం సాగునీటీ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. మిషన్ కాకతీయ గ్రామాల్లో విజయవంతం అయినట్టుగానే పట్టణాల్లోనూ ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడాలన్నారు.  పట్టణాల్లోని చెరువుల అభివృద్ది కోసం సాద్యం అయినన్ని ఎక్కువ చెరువలను ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ది చేస్తామన్నారు.  ఈ సమావేశంలో హెచ్ యండిఏ, జియచ్ యంసి, మెట్రో వాటర్ వర్క్ బోర్డు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పర్యాటక శాఖ, సాగునీటి శాఖ అధికారులు పాల్గొన్నారు.

KT Rama Rao, Harish Rao review on urban lakes

- Advertisement -