‘అహం బ్రహ్మాస్మి’ అంటున్న బాలయ్య..

220
- Advertisement -

రాధాకృష్ణ జాగర్లమూడి.. టాలీవుడ్ ప్రజలు షార్ట్ గా క్రిష్ అని పిలుస్తూ ఉంటారు. గమ్యం సినిమా తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన ఈ డైరెక్టర్ ఎన్నో మంచి సినిమాలకు దర్శకత్వం వహించాడు. క్రిష్ అందరిలాగా కమర్షియల్ సినిమాలపై అస్సలు మొగ్గుచూపడు. ఎప్పుడు ప్రేక్షకులకు ఎదో ఒకటి కొత్తగా చూపించాలన్న తపనతో వేదం కృష్ణం వందే జగద్గురుమ్ కంచె లాంటి అద్భుతమైన సినిమాలను మనకు అందించాడు.

కాగా,ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో ‘అహం బ్రహ్మాస్మి’అనే సినిమా రూపొందనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో కథానాయకుడు ఎవరా అనే ఆసక్తి అందరిలోనూ రేకెత్తుతోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ సినిమాలో కథానాయకుడిగా బాలకృష్ణ నటించనున్నారనీ .. ఆయనని క్రిష్ ఒప్పించడం జరిగిపోయిందని అంటున్నారు.

Krish's "Aham Brahmasmi" With Balayya

‘మణికర్ణిక’ తరువాత క్రిష్‌ .. ‘ఎన్టీఆర్’ బయోపిక్ తరువాత బాలకృష్ణ చేసే సినిమా ఇదేనని చెబుతున్నారు. గతంలో బాలకృష్ణ .. క్రిష్ కాంబినేషన్లో ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ వచ్చింది. చారిత్రక నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాలకృష్ణ కెరియర్‌లోనే చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. అలాంటి ఈ కాంబినేషన్లో ‘అహం బ్రహ్మాస్మి’ రూపొందనుందనేది బాలయ్య అభిమానులకు శుభవార్తే. కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సివుంది.

- Advertisement -