20ఏళ్ల తర్వాత రమ్యకృష్ణతో కృష్ణవంశీ

500
KrishnaVamshi RamyaKrishna
- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్ లో టాప్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ఆమె పలు సినిమాల్లో గెస్ట్ రోల్ లో కనిపిస్తూ వచ్చారు. బాహుబలి చిత్రం తర్వాత రమ్యకృష్ణ మళ్లీ బిజీ అయ్యారు. స్పెషల్ అట్రాక్షన్ గా రమ్యకృష్ణ కోసం తమ సినిమాల్లో తీసుకుంటున్నారు దర్శకులు. ఇక రమ్యకృష్ణ భర్త ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.

ఆయన చివరగా తెరకెక్కించిన సాయి ధరమ్ తేజ్ నక్షత్రం సినిమా ప్లాప్ తర్వాత మరో సినిమా చేయలేదు. ప్రస్తుతం కృష్ణవంశీ ఓ విభిన్నమైన కథను సిద్దం చేసినట్లు తెలుస్తుంది. ఈసినిమాలో కీలక పాత్ర కోసం రమ్యకృష్ణను ఎంపిక చేసుకున్నాడట కృష్ణవంశీ. ఇందులో విలక్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్, అవికాగోర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇదిలా ఉండగా రమ్యకృష్ణ , కృష్ణవంశీ ఇద్దరు కలిసి ఇరవై సంవత్సరాల తర్వాత సినిమా చేస్తున్నారు. రమ్య‌కృష్ణ తొలిసారి 1998లో చంద్ర‌లేఖ సినిమా కోసం ప‌నిచేశారు. మ‌ళ్ళీ 20 ఏళ్ళ త‌ర్వాత వారిద్దరు ఓ ప్రాజెక్ట్ కోసం క‌లిసి పని చేయ‌నుండ‌డం విశేషంగా చెప్పుకోవచ్చు

- Advertisement -