కృష్ణ నీటి విడుదలపై ఉత్తర్వులు జారీ..

488
krishna
- Advertisement -

కృష్ణ నది బోర్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలకు కృష్ణానదీ జలాల పంపిణీ అంశాల్ని చర్చించేందుకు ఈ రోజు కృష్ణాబోర్డు సమావేశమైంది. రెండు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీపై నిర్ణయాలు తీసుకోవడంతోపాటు ఇన్‌ఫ్లోలపై సమావేశంలో చర్చించారు. కనీస నీటి వినియోగ మట్టానికిపైన అందుబాటులో ఉన్న 257.54 టీఎంసీలలో ఇరు రాష్ట్రాలకు కేటాయింపు జరిగింది. సెప్టెంబర్ వరకు తెలంగాణకు 59 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ కు 152 టీఎంసీల నీటిని కేటాయించింది.

Krishna River

తెలంగాణకు శ్రీశైలం నుంచి 14.5 టీఎంసీలు, నాగార్జున సాగర్ నుంచి 44.51టీఎంసీలు,కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తాగు, సాగునీటి అవసరాలకు 14.50 టీఎంసీలు, సాగర్ ఎడమ కాలువ నుంచి 26.06 టీఎంసీలు,ఏఎమ్మార్పీ నుంచి 10.47టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 5.90టీఎంసీలు, మిషన్ భగీరథకు 2.08టీఎంసీలు విడుదల చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ కు శ్రీశైలం నుంచి 100 టీఎంసీలు, నాగార్జున సాగర్ నుంచి 52 టీఎంసీలు,చెన్నైకి తాగునీరు సహా పోతిరెడ్డిపాడు నుంచి 88టీఎంసీలు,హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి 12 టీఎంసీలు,సాగర్ కుడి కాలువ ద్వారా 32టీఎంసీలు, ఎడమ కాలువ ద్వారా 5 టీఎంసీలు,కృష్ణా డెల్టాకు 15 టీఎంసీలు కేటాయించారు.

- Advertisement -