5న ఇరురాష్ట్రాలతో గోదావరి బోర్డు సమావేశం..

281
krishna river board
- Advertisement -

ఈనెల 5న ఇరు రాష్ట్రాల అధికారులతో గోదావరి నది యజమాన్య బోర్డు సమావేశం కానుంది. ఈ సమావేశంలో చర్చించే ముఖ్యమైన ఏజెండాలను గోదావరి నది యాజమాన్య బోర్డ్ ఇరు ప్రభుత్వాలకు పంపింది. ఏజెండాలో ప్రధానంగా 5 అంశాల ప్రస్తావనకు రానున్నాయి.

  • గోదావరి నదిపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు చేపడుతున్న ప్రాజెక్టులు, అభ్యంతరాలు, ప్రాజెక్టుల డీపీఆర్‌లు
  • వచ్చే సంవత్సరానికి సంబంధించి నీటి పంపకాలు.
  • నీటి వినియోగంకు సంబంధించి టెలిమెట్రిక్ ఏర్పాటు.
  • గోదావరి నది యజమాన్య బోర్డు సంబంధించిన నిధులు.
    ఇవి కాకుండా ఇరు రాష్ట్రాలు సూచించే అంశాలను చర్చకు అంగీకరించనున్నట్లు బోర్డు వెల్లడించింది.
- Advertisement -