హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

75
- Advertisement -

తెలంగాణకు చెందిన ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ పై సస్పెన్షన్ ఎత్తి వేసింది ఎన్నికల సంఘం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ సమాచారం ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి రోజు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ అంజనీకుమార్ పై సస్పెన్షన్ వేటు వేయగా దీనిపై ఆయన ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందింది.

ఇక రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇచ్చింది ప్రభుత్వం. హైదరాబాద్ సీపీ గా కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి, సైబరాబాద్ సీపీ గా అవినాష్ మహంతి, రాచకొండ సీపీ గా సుధీర్ బాబు, తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరక్టర్ గా సందీప్ శాండీల్య నియమితులయ్యారు.

Also Read:కేసీఆర్ కోసం ప్రార్ధన చేశా:కేఏ పాల్

 

- Advertisement -